డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పిస్తామని మోసం

ABN , First Publish Date - 2020-06-02T13:44:52+05:30 IST

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పిస్తామని ఓ మహిళను తన

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పిస్తామని మోసం

  • మహిళ నుంచి లక్ష రూపాయలు వసూలు
  • నిందితుడి అరెస్టు.. 
  • రూ. 38 వేలు, నకిలీ పత్రాలు స్వాధీనం

హైదరాబాద్/ఉప్పల్‌ : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పిస్తామని ఓ మహిళను తన  స్నేహితులతో కలిసి మోసం చేసి లక్ష రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని ఉప్పల్‌ పోలీసులు అరెస్టు చేశారు. రామంతాపూర్‌ వివేక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ కె. వెంకటేష్‌(48), అదే ప్రాంతానికి చెందిన మోహన్‌, బోడుప్పల్‌కు చెందిన శశికాంత్‌తో కలిసి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇప్పిస్తామని ఓ మహిళను నమ్మించారు. ఇల్లు మంజూరైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆమె నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఇలాగే కొంతమందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు మేరకు నిందితుడు వెంకటే‌ష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 38 వేలు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. 

Updated Date - 2020-06-02T13:44:52+05:30 IST