డోర్నకల్ ఎమ్మెల్యే Redyanaikకు నిరసన సెగ

ABN , First Publish Date - 2022-06-14T19:52:10+05:30 IST

జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు నిరసన సెగ తగిలింది.

డోర్నకల్ ఎమ్మెల్యే Redyanaikకు నిరసన సెగ

మహబూబాబాద్: జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌(Redyanaik )కు నిరసన సెగ తగిలింది. నర్సింహులపేట మండలం జయపురంలో పల్లెప్రగతికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ఇళ్లు శంఖుస్థాపన శిలాఫలకం వద్ద బైఠాయించి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 

Updated Date - 2022-06-14T19:52:10+05:30 IST