ప్రజలపై పన్నుల భారం మోపుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-19T05:06:59+05:30 IST

చెత్తపన్ను, డ్రైయినేజీ పన్ను, మరుగుదొడ్డి పన్ను, వీధిలైట్ల పన్ను అంటూ ప్రభుత్వం భారం మోపడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి వెంకట నరసింహా రావు అన్నారు

ప్రజలపై పన్నుల భారం మోపుతున్న ప్రభుత్వం
సమస్యలు తెలుసుకుంటున్న టీడీపీ నేతలు

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 18: చెత్తపన్ను, డ్రైయినేజీ పన్ను, మరుగుదొడ్డి పన్ను, వీధిలైట్ల పన్ను అంటూ ప్రభుత్వం భారం మోపడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి వెంకట నరసింహా రావు అన్నారు. పదో వార్డులో గురువారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు సమస్యలను ఏకరువు పెట్టారు. సభ్య త్వ నమోదు ప్రక్రియ, ఓటర్ల లిస్టు పరిశీలన కార్యక్రమాలను నాయకులు చేపట్టారు. గండేటి వెంకటేశ్వరరావు, బి.మణిరత్నం, బుగ్గే ఆనంద్‌, బాబూ రావు, అల్లం తాతాజీ, బి.రవికుమార్‌, గడ్డం రవి, జి.సుధీర్‌, ఉండ్రు శ్రీనివాస్‌, యర్రంశెట్టి దుర్గ భవాని, పలువురు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:06:59+05:30 IST