ఆందోళన వద్దు.. క్షేమంగా ఉన్నా: వెంకయ్య
ABN , First Publish Date - 2020-10-01T08:53:27+05:30 IST
తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని.. క్షేమంగా ఉన్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ ద్వారా చెప్పారు...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని.. క్షేమంగా ఉన్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ ద్వారా చెప్పారు. ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెంకయ్య తెలిపారు. పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు తదితరులు.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.