ఆర్పీలు ఆందోళన చెందవద్దు : మెప్మా పీడీ

ABN , First Publish Date - 2020-02-20T10:55:08+05:30 IST

మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెప్మా పీడీ సుగుణకరరావు అన్నారు.

ఆర్పీలు ఆందోళన చెందవద్దు : మెప్మా పీడీ

సాలూరు, ఫిబ్రవరి 19 : మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెప్మా పీడీ సుగుణకరరావు అన్నారు. సాలూరు మున్సిపల్‌ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయన కమిషనర్‌ నూకేశ్వరరావుతో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో 350 మంది ఆర్పీలు మెప్మాలో పని చేస్తున్నారని అన్నారు. వారికి సంబంధించి విద్యార్హతలు, అనుభవం, వయసు మొదలైన వాటిని పరిశీలిస్తున్నామన్నారు.  అర్హత ఉన్నవారందరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో మెప్మా సీఎంపీ పుష్పా తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T10:55:08+05:30 IST