మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉంటే ఉజ్వలభవిష్యత్తు
ABN , First Publish Date - 2021-10-29T04:36:22+05:30 IST
మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉంటే ఉజ్వలభవిష్యత్తు లభిస్తుందని నాయుడుపేట సెబ్ సీఐ అరుణకుమారి అన్నారు.
సెబ్ సీఐ అరుణకుమారి
నాయుడుపేట టౌన్, అక్టోబరు 28 : మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉంటే ఉజ్వలభవిష్యత్తు లభిస్తుందని నాయుడుపేట సెబ్ సీఐ అరుణకుమారి అన్నారు. పట్టణంలోని శ్రీవేమ జూనియర్ కళాశాలలో గురువారం మత్తుపదార్థాలు వాడకంవల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు సెబ్ సీఐ అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలే తప్ప మత్తుపదార్థాలకు అలవాటుపడి భవిష్యత్తును పాడుచేసుకోకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీవేమ విద్యాసంస్థల అధినేత పెమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి, కళాశాల ఇన్చార్జి రవీంద్రారెడ్డి, అధ్యాపకులు కృష్ణ, సెబ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.