విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ

ABN , First Publish Date - 2022-08-14T05:06:56+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ

విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ

వికారాబాద్‌,ఆగస్టు 13: బందోబస్తు విధుల్లో ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం వహించకూడదని, అందరూ సమన్వయంతో నిర్వహించాలని  ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. శనివారం ఎస్పీ కార్యాయంలో సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్ల గురించి పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అందరూ నీట్‌ యూనిఫారం ధరించి, సమయానికి విధులకు హాజరుకావాలన్నారు.  పోలీస్‌ అధికారులు డ్యూటీ సమయంలో ఐడీ కార్డులు తప్పని సరిగా ధరించాలని సూచించారు. డ్యూటీ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సెక్టార్‌ ఇన్‌చార్జి అధికారులకు సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా పోలీస్‌ అధికారులు ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. ట్రాఫిక్‌ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:06:56+05:30 IST