గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వద్దు
ABN , First Publish Date - 2022-07-03T05:55:09+05:30 IST
గ్రామాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని జడ్పీ సీఈ వో సురేష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గాజులమల్కాపురం, లింగాల, అనంతారం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
పెన్పహాడ్, జూలై 2: గ్రామాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని జడ్పీ సీఈ వో సురేష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గాజులమల్కాపురం, లింగాల, అనంతారం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనులపై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఆయా గ్రామాల్లో వన నర్సరీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో రమేష్, ఏపీవో రవి, ఈసీ ఏకస్వామి,సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.