‘బీమా నమోదులో నిర్లక్ష్యం వద్దు’
ABN , First Publish Date - 2021-05-14T06:05:32+05:30 IST
వైఎస్సార్ బీమా పథకం నమోదులో నిర్లక్ష్యం వద్దని ఎంపీడీవో అల్లాబకాష్ సూచించారు. పట్టనంలోని తన కార్యాలయంలో వైఎస్సార్ బీమాపై హెల్పర్, డిజిటల్ అసిస్టెంట్లతో గురువారం సమావేశం నిర్వహించారు.
ఆలూరు రూరల్, మే 13: వైఎస్సార్ బీమా పథకం నమోదులో నిర్లక్ష్యం వద్దని ఎంపీడీవో అల్లాబకాష్ సూచించారు. పట్టనంలోని తన కార్యాలయంలో వైఎస్సార్ బీమాపై హెల్పర్, డిజిటల్ అసిస్టెంట్లతో గురువారం సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియను ఈ నెలాఖరిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్సార్ బీమా పథకంలో 2400 సభ్యుల నమోదు కావాల్సి ఉందన్నారు. జగనన్న తోడును సక్రమంగా అమలు చేయాలని అన్నారు. సమావేశంలో ఏపీఎం అశోక్, ఈవో నాగభూషణం, పంచాయతీ కార్యదర్శులు విజయకుమార్, వెంకటనాయుడు, హెల్పర్, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.