మమ్మల్ని టిష్యూ పేపర్లలా చూడొద్దు: ఎయిర్ ఇండియా పైలట్లు

ABN , First Publish Date - 2020-06-06T16:59:42+05:30 IST

ఎయిర్ ఇండియా తమతో వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ పైలట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

మమ్మల్ని టిష్యూ పేపర్లలా చూడొద్దు: ఎయిర్ ఇండియా పైలట్లు

ముంబై: ఎయిర్ ఇండియా తమతో వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ పైలట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం తమతో పరిహసాలాడుతోందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలు విమానం నడిపారనే దాని ఆధారంగా పైలట్లకు పారితోషకం చెల్లించే యోచనలో సంస్థ ఉందన్న వార్తల నేపథ్యంలో వారు తమ ఆక్రోశం వెళ్లగక్కారు.


‘ఓవైపు..మమల్ని కరోనా యొధులంటూ పొగడ్తల్లో మంచెత్తుతున్నారు. మాత‌‌ృదేశం కోసం గొప్ప సేవ చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు. ఇలా మాతో అవమానకరంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఓ పైలట్ వాపోయారు. ‘ఇది మా నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ ప్రతిపాదను అంగీకరించం. మోము టిష్యుపేపర్లే భావన మాకు కలిగేలా యాజమాన్యం చేయొద్దు’ అని ఆయన సూటి వ్యాఖ్యలు చేశారు. అంతకుమునుపు.. పైలట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రాసిన అంతర్గత లేఖలో..మార్చి 4 వరకూ బాకీపడ్డ ఫ్లైయింగ్ ఎలవెన్సులను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-06T16:59:42+05:30 IST