అనవసరంగా రోడ్లపైకి రావద్దు
ABN , First Publish Date - 2020-03-31T10:29:01+05:30 IST
లాక్డౌన్ విధించినందున అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావొద్దని సీఐ వినోద్బాబు హెచ్చరించారు. సోమవారం
ఇచ్ఛాపురం, మార్చి 30 : లాక్డౌన్ విధించినందున అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావొద్దని సీఐ వినోద్బాబు హెచ్చరించారు. సోమవారం ఇచ్ఛాపురంలో యువకులు విచ్చలవిడిగా రోడ్లపై సంచరించడంతో వారిని గుర్తించి మోకాళ్లపై కూర్చొబెట్టి నడిపించారు. పురుషోత్తపురం చెక్పోస్టు వద్ద పోలీసులు ఒడిశా నుంచి వచ్చిన కార్లను అడ్డుకున్నారు. అయినా అడ్డదారిలో ఇచ్ఛాపురం వైపు వచ్చిన కార్లను సీఐ అడ్డుకున్నారు. మరోసారి కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇచ్ఛాపురం రూరల్: లాక్డౌన్ పకడ్బందీగా అమలుచేయాలని రూరల్ ఎస్ఐ కె.లక్ష్మి తెలిపారు. సోమవారం మండలంలోని కేదారిపురం తదితర సరిహద్దు గ్రామాల్లోని చెక్పోస్టులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎవర్నీ అనుమతించవద్దని తెలిపారు.