స్వాతంత్య్ర సమరయోధులను మరువరాదు

ABN , First Publish Date - 2022-08-12T05:26:26+05:30 IST

భారతదేశ స్వాతంత్య్రం కో సం పాటుపడిన మహనీయులను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని పైనాట్స్‌ ఆర్కెటెక్చర్‌ యూనివర్శిటీ ఇన్‌చార్జి వీసీ సూర్యకళావతి అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధులను మరువరాదు
జాతీయ జెండాను ర్యాలీగా తీసుకెళుతున్న విద్యార్థులు

కడప వైవీయూ, ఆగస్టు 11: భారతదేశ స్వాతంత్య్రం కో సం పాటుపడిన మహనీయులను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని పైనాట్స్‌ ఆర్కెటెక్చర్‌ యూనివర్శిటీ ఇన్‌చార్జి వీసీ సూర్యకళావతి అన్నారు. ఈ సందర్భంగా హర్‌ఘర్‌ తిరంగ్‌ వేడుకల్లో భాగంగా డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కెటెక్చర్‌ అండ్‌ ఫైనాట్స్‌ యూనివర్శిటీ విద్యార్థులు 330 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈర్యాలీని యూనివర్శిటీ ఇన్‌ఛార్జి వీసీ సూర్యకళావతి, రిజిసా్ట్రర్‌ ప్రొఫెసర్‌ వీసీ సురేంద్రనాథరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జాతి సమైక్యత కో సం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.మువ్వెన్నెల జెం డాను రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. రిజిసా్ట్రర్‌ ప్రొఫెసర్‌ వీసీ సురేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ స్వా తంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఒ క్కరు తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కెటెక్చర్‌ యూనివర్శిటీలో ప్రతి గది తరగతి గదిపైన జాతీయ పతాకం ఎగురవేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. యూనివర్శిటీ నుంచి విద్యార్థులు ర్యాలీగా వెళ్లి కడపలోని కోటిరెడ్డి సర్కిల్‌ నుం డి అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా మహవీర్‌ సర్కిల్‌ వరకు సాగిన ఈ ర్యాలీలో వి ద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున ఉత్సాహంతో పాల్గొని హర్‌ఘర్‌ తిరంగ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపట్ల సంతోషంగా ఉందన్నారు. యూనివర్శిటీలో అజాదికా అమృత్‌లో భాగంగా క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వ, ఫోటోగ్రఫి విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.వైవీయూ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, ఎన్‌ఎ్‌సఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రామసుబ్బారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:26:26+05:30 IST