TS News: పార్టీ మారి చరిత్ర హీనులుగా మారకండి..రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2022-08-15T23:30:53+05:30 IST
Hyderabad: కాంగ్రెస్ పార్టీ వీడి చరిత్రహీనులుగా మారొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను కేసీఆర్ ప్రయోగశాలగా మార్చారని విమర్శించారు. మునుగోడులో సర్పంచులు, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారని
Hyderabad: కాంగ్రెస్ పార్టీ (Congress Party) వీడి చరిత్రహీనులుగా మారొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revanth Reddy) కోరారు. పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను కేసీఆర్ ప్రయోగశాలగా మార్చారని విమర్శించారు. మునుగోడులో సర్పంచులు, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ కారణంగా మునుగోడు (Munugodu)లో పర్యటించలేకపోతున్నానని, ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడులోనే ఉంటానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు పార్టీ మారొద్దని కోరారు. సంవత్సరం ఓపిక పడితే.. కాంగ్రెస్దే అధికారమన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్ను దిశానిర్దేశం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది.