ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN , First Publish Date - 2020-04-09T10:19:02+05:30 IST

రబీ వరిధాన్యం సేకరణలో రైతు లను ఇబ్బంది పెట్టొద్దని జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి అధికా రులను ఆదేశించారు.

ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి


ఘట్‌కేసర్‌ రూరల్‌: రబీ వరిధాన్యం సేకరణలో రైతు లను ఇబ్బంది పెట్టొద్దని జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి అధికా రులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాల యంలో వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని మాదారం, ఎదులాబాద్‌, ప్రతాప సింగారం గ్రామాల్లో వరిధాన్యం కొనుగొలు కేంద్రాలను త్వరలో ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌తో రైతులకు ఇబ్బందులు లేకుండా వరికోత యంత్రాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సూచించారు. మండలంలో దాదాపు 4,200 ఎకరాల్లో వరిఽపైరు కోతకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, డీసీఎంసీ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మీ, ఎంపీడీవో అరుణ, మండల వ్యవసాయ అధికారి బాసిత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T10:19:02+05:30 IST