పుకార్లు నమ్మి పెంపుడు జంతువులను హింసించకండి!
ABN , First Publish Date - 2020-03-27T14:34:16+05:30 IST
కరోనా వైరస్పై చెలరేగుతున్న పుకార్లను నమ్మి పెంపుడు జంతువులను హింసించవద్ద
చెన్నై : కరోనా వైరస్పై చెలరేగుతున్న పుకార్లను నమ్మి పెంపుడు జంతువులను హింసించవద్దని, వాటిని ఎక్కడబడితే అక్కడి విడిచి పెట్టవదద్దని వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు హెచ్చరించింది. ఈ మేరకు ఆ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. నగరాల్లో తమ ఇళ్ల వద్ద పెంచుకుంటున్న కుక్కలు, పిల్లులు, పక్షుల వల్ల కరోనా వైరస్ వ్యాపించదని తెలిపారు.
అయితే పెంపుడు జంతువుల వల్ల కరోనా వ్యాపిస్తుందని పుకార్లు వ్యాపించడంతో పలువురు తమ వద్దనున్న కుక్కలు, పిల్లులను హింసిస్తున్నారని, వాటిని దూరంగా విడిపెట్టి వస్తున్నారని తమకు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని ఆరోగ్యశాఖ కూడా ప్రకటించిందని, కనుక ఇకపై రాష్ట్రంలో పెంపడు జంతువులను ఎవరూ హింసించకూడదని, వాటిని రోడ్డపై విడిచిపెట్టరాదని హెచ్చరించారు.