‘మత్తు’కు బానిసలు కావద్దు!
ABN , First Publish Date - 2021-06-24T05:03:56+05:30 IST
మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు హితవు పలి కారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్లో బుధవారం ప్రజలకు అవగాహన కల్పిం చారు.
చీపురుపల్లి, జూన్ 23: మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు హితవు పలి కారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్లో బుధవారం ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెడు వ్యసనాలు ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని పాడు చేస్తాయన్నారు. ముఖ్యంగా యువత వాటికి అలవాటు పడి భవిష్యత్ను పాడు చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెర్లాం: మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని ఎస్ఐ సురేంద్రనాయుడు సూచించారు. ఈ మేరకు తెర్లాం జంక్షన్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఖైనీ, గుట్కా తదితర వాటిని వినియోగించినా, కొనుగోలు చేసినా నేరమని చెప్పారు. సీతానగరం(బొబ్బిలి): మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఐ ఆర్.జైభీమ్ సూచించారు. బొబ్బిలిలోని రైల్వే జంక్షన్ వద్ద అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్ రవాణాపై తమకు సమా చారం అందించాలని, ఎస్ఈబీ, బొబ్బిలి స్టేషన్ ఎస్ఐ చిన్నంనాయుడు, సిబ్బంది, బొబ్బిలి పరిధిలోని మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.