‘మత్తు’కు బానిసలు కావద్దు!

ABN , First Publish Date - 2021-06-24T05:03:56+05:30 IST

మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు హితవు పలి కారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్‌లో బుధవారం ప్రజలకు అవగాహన కల్పిం చారు.

‘మత్తు’కు బానిసలు కావద్దు!
బొబ్బిలిలో అవగాహన కల్పిస్తున్న దృశ్యం

చీపురుపల్లి, జూన్‌ 23: మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు హితవు పలి కారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్‌లో బుధవారం ప్రజలకు అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెడు వ్యసనాలు ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని పాడు చేస్తాయన్నారు. ముఖ్యంగా యువత వాటికి అలవాటు పడి భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.    తెర్లాం:  మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని ఎస్‌ఐ సురేంద్రనాయుడు సూచించారు. ఈ మేరకు తెర్లాం జంక్షన్‌లో ప్రజలకు అవగాహన కల్పించారు.  ఖైనీ, గుట్కా తదితర  వాటిని వినియోగించినా, కొనుగోలు చేసినా నేరమని చెప్పారు.    సీతానగరం(బొబ్బిలి):  మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని   సీఐ ఆర్‌.జైభీమ్‌ సూచించారు.   బొబ్బిలిలోని రైల్వే జంక్షన్‌ వద్ద అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.  డ్రగ్స్‌ రవాణాపై తమకు సమా చారం అందించాలని,   ఎస్‌ఈబీ, బొబ్బిలి స్టేషన్‌ ఎస్‌ఐ చిన్నంనాయుడు, సిబ్బంది, బొబ్బిలి పరిధిలోని  మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-06-24T05:03:56+05:30 IST