కరోనా లక్షణాలుంటే.. ఆగస్టు 15 వేడుకలకు రావొద్దన్న పోలీసులు!

ABN , First Publish Date - 2020-08-13T04:40:01+05:30 IST

దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా లక్షణాలున్న అతిథులు రావొద్దని ఢిల్లీ పోలీసులు కోరారు.

కరోనా లక్షణాలుంటే.. ఆగస్టు 15 వేడుకలకు రావొద్దన్న పోలీసులు!

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా లక్షణాలున్న అతిథులు రావొద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలకు వచ్చే అతిథులకు పోలీసులు ఈ సూచన చేశారు. ఆగస్టు 15కు రెండు వారాల ముందు ఎప్పుడైనా తమలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఉత్సవాలకు రాకుండా ఉంటే మంచిదని చెప్పారు. అలాగే కార్యక్రమానికి హాజరయ్యే వారు కూడా కరోనా విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అతిథులను తెలియజేశారు.

Updated Date - 2020-08-13T04:40:01+05:30 IST