కార్మిక చట్టాలను సవరించొద్దు
ABN , First Publish Date - 2020-05-26T10:34:25+05:30 IST
కార్మికులకు 12 గంటల పని విధానం విరమించు కుని 8 గంటల విధానం కొనసాగించాలని, కార్మిక చట్టాల సవరణను కేంద్ర ..
జంగారెడ్డిగూడెం, మే 25: కార్మికులకు 12 గంటల పని విధానం విరమించు కుని 8 గంటల విధానం కొనసాగించాలని, కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్య దర్శి తలారి ప్రకాశ్ అన్నారు. సోమవారం కార్మిక చట్టాలపై అఖిలపక్ష కమిటీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏఐకే ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటరత్నం, టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రసాద్, పీకేఎస్ జిల్లా అధ్యక్షుడు మస్తాన్, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్య క్షుడు ఎం.రామన్న తదితరులు పాల్గొన్నారు.