కృత్రిమ అవయవాలు అందజేత
ABN , First Publish Date - 2022-09-27T06:07:26+05:30 IST
సుధీక్షణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల అందజేత కార్యక్రమం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగింది.
కృత్రిమ అవయవాలు అందజేత
కలెక్టరేట్, సెప్టెంబరు 26 : సుధీక్షణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల అందజేత కార్యక్రమం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగింది. వివిధ ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన ఐదుగురు విద్యార్థులకు కలెక్టర్ ఎస్. దిల్లీరావు కృత్రిమ అవయవాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ స్థాపకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ ప్రతి నెలా ఐదుగురుకి కృత్రిమ అవయవాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉప రవాణా శాఖ అధికారి పురేంద్ర, ఎం. వాసు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.