గాడిద పాలు 100 మి.లీ రూ.800 !

ABN , First Publish Date - 2021-12-31T17:05:57+05:30 IST

కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గాడిద పాలు ఎంతో ఉపయోగపడతాయని తిరునల్వేలి పట్టణంలో వదంతులు వ్యాపించాయి. దీంతో, తిరుచ్చి నుంచి

గాడిద పాలు 100 మి.లీ రూ.800 !

                      - మొహం చూస్తే రూ.15 ఛార్జీ


పెరంబూర్‌(చెన్నై): కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గాడిద పాలు ఎంతో ఉపయోగపడతాయని తిరునల్వేలి పట్టణంలో వదంతులు వ్యాపించాయి. దీంతో, తిరుచ్చి నుంచి తిరునల్వేలి గాడిదలతో వచ్చిన దంపతుల వ్యాపారం జోరుగా సాగుతోంది. గాడిద పాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుంటుందని, ఈ పాలను పిల్లలకు ఇస్తే ఒమైక్రాన్‌, కరోనా, పచ్చకామెర్లు సహా పలు రోగాలు దరికి రావని భావించిన తల్లిదండ్రులు గాడిద పాలను కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో గాడిద మొహాన్ని చూస్తే వైరస్‌, వ్యాధులు దరిచేరవని ముత్తాత, తాతలు చెప్పిన మాటలు ప్రస్తుత ఆధునిక ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. దీంతో, గాడిద పాలు 100 మి.మీ రూ.800లకు కొనుగోలు చేస్తండగా, పిల్లలకు గాడిద మొహాన్ని చూపించేందుకు ఒకరికి రూ.15 వసూలు చేస్తున్నట్లు ఆ దంపతులు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-31T17:05:57+05:30 IST