డ్రోన్‌ సహకారంతో భూసర్వే

ABN , First Publish Date - 2021-05-18T03:27:01+05:30 IST

భూసర్వేలో సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. మండలంలో

డ్రోన్‌ సహకారంతో భూసర్వే
డ్రోన్‌ సర్వేను ప్రారంభిస్తున్న తహసీల్థార్‌ సోమ్లానాయక్‌

ముత్తుకూరు, మే 17 : భూసర్వేలో సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ  సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు సోమవారం శ్రీకారం చుట్టారు. మండలంలోని మల్లూరును పైలెట్‌ విలేజ్‌గా తీసుకొని సర్వేకు తహసీల్థార్‌ సోమ్లా నాయక్‌ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న భూములను డిజిటల్‌ రూపంలో పొందుపరిచేందుకు డ్రోన్‌ సహకారంతో భూముల సర్వే చేస్తున్నామన్నారు. గ్రామానికి చెందిన పూర్తి స్వరూపాన్ని గుర్తించి వివరాలు పొందుపరుస్తామన్నారు. ఆ తర్వాత సర్వే నెంబర్ల వారీగా భూమి విస్తీర్ణం వివరాలను గ్రో ద్వారా ఇస్తామన్నారు. దీంతో భూముల వివరాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. తద్వారా భవిష్యత్తులో భూవివాదాలు పరిష్కరించేందుకు సులభంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, దువ్వూరువారిపాళెం సర్పంచ్‌ కృష్ణవేణి తదితరులున్నారు. 


Updated Date - 2021-05-18T03:27:01+05:30 IST