‘స్పందించు-ఆక్సిజన అందించు’కు విరాళాలు

ABN , First Publish Date - 2021-05-19T06:26:19+05:30 IST

కరోనా కష్టకాలంలో నిస్వార్థంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడటానికి ఆర్డీటీ స్పందించు-ఆక్సిజన అందించు కార్యక్రమాన్ని తలపెట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

‘స్పందించు-ఆక్సిజన అందించు’కు విరాళాలు

ధర్మవరంఅర్బన, మే 18: కరోనా కష్టకాలంలో నిస్వార్థంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడటానికి ఆర్డీటీ స్పందించు-ఆక్సిజన అందించు కార్యక్రమాన్ని తలపెట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తనయుడు జయ సూర్యప్రతాప్‌రెడ్డి 15వ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే, తన యుడు, మున్సిపల్‌ చైర్‌పర్సన లింగం నిర్మల, వైస్‌చైర్మన చం దమూరి నారాయణరెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, నాయకుడు ఉడుముల రాములు కలిసి అనంతపురం లోని ఆర్డీటీ కార్యాలయంలో మాంచోఫెర్రర్‌కు రూ.10.20 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్డీటీ స్థాపించినప్పటి నుండి జిల్లాలో ఎన్నో సేవా కార్య క్రమాలను చేపట్టిందన్నా రు. ఇందులో భాగంగా ఆర్డీటీ విద్య, వైద్యంతో పాటు అనేక కార్యక్రమా లను అందిస్తోందన్నారు.

38వ వార్డుకౌన్సిలర్‌.. స్పందించు-ఆక్సిజన అందించు కార్య క్రమానికి పట్టణంలోని 38వ వార్డు కౌన్సిలర్‌ షంషాద్‌బేగం, ఆమె భర్త చాంద్‌బాషాలు చైర్‌పర్సన లింగంనిర్మల, వైస్‌చైర్మన చంద మూరి నారాయణరెడ్డిలకు మంగళవారం రూ.35వేలు అందజేశా రు. అదేవిధంగా కో ఆప్షనమెంబర్‌ షమీం, ఆమె భర్త సుబహాన చైర్‌పర్సన రూ.10వేలు ఆంద..జేశారు. అదేవిధంగా 2వ వార్డు జయ రామిరెడ్డి కుమారుడు ఓం శ్రీధర్‌రెడ్డి మిషన ఆక్సిజనకు రూ.50 వేలు అందజేశారు.


Updated Date - 2021-05-19T06:26:19+05:30 IST