కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు దాతల వితరణ

ABN , First Publish Date - 2021-05-09T05:43:43+05:30 IST

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు దాతల వితరణ

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు దాతల వితరణ
ఎమ్మెల్యే రక్షణనిధికి విరాళం అందజేస్తున్న దాతలు

తిరువూరు, మే 8: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో 25 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు, ఆక్సిజన్‌, ఇతర సౌకర్యాల కల్పనకు దాతలు మందుకు వచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద పలువురు దాతలు సుమారు రూ.10 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే రక్షణనిధికి అందించారు. గంలపలగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు గోగులమూడి చెన్నకేశవరావు రూ.2 లక్షలు, ఎ.కొండూరుకు చెందిన  కాలసాని చెన్నారావు రూ.లక్ష, పూర్వవిద్యార్థుల సంఘం రూ.లక్ష, 14వ వార్డు కౌన్సిలర్‌ పసుపులేటి శేఖర్‌బాబు రూ.75 వేలు, యరమల రామచంద్రారెడ్డి రూ.50 వేలు గద్దల ఏసురత్నం రూ.50 వేలు, అమరావతి మల్టీ స్పెషాలిటీ వైద్యశాల డైరెక్టర్‌ కోనేరు కృష్ణన్‌ రూ.50 వేలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరి, వైస్‌చైర్‌పర్సన్‌ వెలుగోటి విజయలక్ష్మి, కో ఆప్షన్‌ సభ్యుడు ఏరువ ప్రకాష్‌రెడ్డి, 5, 15 వార్డుల కౌన్సిలర్లు అనుమోలు రమాదేవి, మోదుగు ప్రసాదు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రేగళ్ల మోహన్‌రెడ్డి, డాక్టర్‌ తాళ్లూరి రామకోటేశ్వరరావు ఒకొక్కరు రూ.25 వేల చొప్పున విరాళం అందించారు. 



Updated Date - 2021-05-09T05:43:43+05:30 IST