కరోనా విపత్తు ఎదుర్కొనేందుకు విరాళాలు

ABN , First Publish Date - 2020-03-31T10:45:30+05:30 IST

సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ద్వారా దాతలు సోమవా రం విరాళాలు అందించారు. మొయ్యేరు సొసైటి చైర్మన్‌

కరోనా విపత్తు ఎదుర్కొనేందుకు విరాళాలు

గణపవరం, మార్చి 30: సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ద్వారా దాతలు సోమవా రం విరాళాలు అందించారు. మొయ్యేరు సొసైటి చైర్మన్‌ గంటా రామకృష్ణ రూ.50 వేలు, కార్యదర్శి ఎండీ శ్రీనివాసరావు రూ.20 వేలు, సేల్స్‌మన్‌ మేకా శ్రీనివాసరావు రూ.10వేలు, మాజీ అధ్యక్షుడు గొడవర్తి వెంక టేశ్వరరావు రూ.10వేలు, ఇంటూరి పాపారావు రూ.10వేలు మొత్తం రూ.లక్ష చెక్‌ అందజేశారు. గణపవరం సొసైటీ చైర్మన్‌ కొనిశెట్టి రమేష్‌ రూ.50వేలు, పుల్లేటి నాగరాజు రూ.25వేలు, గంటా త్రిమూర్తులు రూ.9 వేలు, మల్లారెడ్డి చినబాబు, ముత్యాల సురేష్‌, జవ్వాది, పుల్లేటి హరేరాం రూ.5వేలు చొప్పున ఇచ్చారు.

Updated Date - 2020-03-31T10:45:30+05:30 IST