గ్రంథాలయంలో పుస్తకాలు కొనుగోలుకు విరాళాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-01-24T06:12:00+05:30 IST
కళాశాలలోని గ్రంథాలయానికి పుస్తకాలు కొనుగోలు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంచాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చెరకాపు వెంకటలక్ష్మి కోరారు.
చీడికాడ, జనవరి 23: కళాశాలలోని గ్రంథాలయానికి పుస్తకాలు కొనుగోలు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంచాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చెరకాపు వెంకటలక్ష్మి కోరారు. శనివారం పాఠశాలలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పుస్తకాల కొనుగోలుకు విరాళాలు సేకరించారు. వైసీపీ నాయకుడు లాలం జానకిరామ్ రూ.5 వేలు, కుర్ల రామ్కుమార్ రూ.5 వేలు, నడుపూరి శ్రీను సోదరులు రూ.5 వేలు, పాటూరి రమణ రూ.5 వేలు ప్రకటించారు. ఉపాధ్యాయులు తంతి హీరాలాల్, డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు, భార్గవి పాల్గొన్నారు.