కార్పొరేట్ విరాళాల వెల్లువ
ABN , First Publish Date - 2020-04-03T06:00:10+05:30 IST
దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ ఏకంగా రూ. 257.50 కోట్ల మొత్తాన్ని పీఎం-కేర్స్ నిధికి అందజేసింది. ఇందులో రూ.250 కోట్లు ఎన్టీపీసీ అందించగా మిగిలిన మొత్తం ఉద్యోగుల ఒక రోజు...
దేశీయ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్టీపీసీ ఏకంగా రూ. 257.50 కోట్ల మొత్తాన్ని పీఎం-కేర్స్ నిధికి అందజేసింది. ఇందులో రూ.250 కోట్లు ఎన్టీపీసీ అందించగా మిగిలిన మొత్తం ఉద్యోగుల ఒక రోజు వేతనంగా ఉంది. ఇక రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్, వైజాగ్ స్టీల్) రూ.6.16 కోట్లను అందించగా హెచ్డీఎ్ఫసీ గ్రూప్ రూ.150 కోట్ల మొత్తాన్ని ఇవ్వగా శ్రీరామ్ గ్రూప్ రూ.10 కోట్లు, కరూర్ వైశ్యా బ్యాంక్ రూ.5 కోట్ల మొత్తాన్ని అందించాయి.