ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు భారీగా విరాళాలు

ABN , First Publish Date - 2020-04-03T19:58:43+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు.

ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు భారీగా విరాళాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయల చొప్పున విరాళాన్నిచెక్కుల రూపంలో మంత్రి సింగిరెడ్డినిరంజన్‌రెడ్డికి వనపర్తి వాసులు అందజేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి నిరోఽధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌చేస్తున్న కృషికీ తాము చేయూతనిస్తామంటూ వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమల సరస్వతి డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ లక్ష రూపాయల చెక్కును, ఎన్‌కెఆర్‌ వేర్‌ హౌస్‌ తరపున లక్ష రూపాయల చెక్కును సంస్థ అధినేత కృష్ణారెడ్డి మంత్రి నిరంజన్‌రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు పెద్దయెత్తున స్పందనరావడం, కరోనా మహమ్మారిని పారదోలేందుకు మేమూ ముందుంటామంటూ పెద్దసంఖ్యలో ముందుకు రావడం ప్రశంసించదగ్గ విషయమని మంత్రి నిరంజన్‌రెడ్డిపేర్కొన్నారు. 

Updated Date - 2020-04-03T19:58:43+05:30 IST