యువనేస్తం ఫౌండేషన్‌కు ఆర్థిక వితరణ

ABN , First Publish Date - 2021-05-07T06:47:05+05:30 IST

మండలంలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను యువనేస్తం పౌండేషన్‌ నిర్వహిస్తోంది.

యువనేస్తం ఫౌండేషన్‌కు ఆర్థిక వితరణ

సింగరాయకొండ, మే 6 : మండలంలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను యువనేస్తం పౌండేషన్‌ నిర్వహిస్తోంది. ఈ పౌండేషన్‌కు గురువారం స్థానిక రైల్వే రోడ్డులో ఉన్న వెంకటరమణ ఆఫ్టికల్స్‌ యాజమాని ఎల్‌.ఏ ప్రసాద్‌ రెడ్డి రూ.ఐదు వేలు ఆర్థిక వితరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు యువనేస్తం అందిస్తున్న ఇతర సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పౌండేషన్‌లోని సభ్యులకు గ్లౌజులు, శానిటైజర్లు వంటి సామాగ్రి కోనుగోలు చేయడానికి వితరణ ఇచ్చినట్లు తెలిపారు. దాతలు సహయంతో తమ పౌండేషన్‌ సేవలను విసృతం చేస్తామని పౌండేషన్‌ అధ్యక్షుడు అంకిపల్లి బంగారు బాబు తెలిపారు.

Updated Date - 2021-05-07T06:47:05+05:30 IST