ఆలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2021-10-26T04:49:34+05:30 IST

మండల పరిధిలోని పాత దువ్వూరులో వెలసిన భీమలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం పుల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కేసీ ఓబుళరెడి ్డ సోమవారం రూ.లక్ష నగదును ఆలయ నిర్మాణ సహాయకులకు అందజేశారు.

ఆలయ పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం
రూ.లక్ష నగదు అందజేస్తున్న కేసీ ఓబుళరెడ్డి

దువ్వూరు, అక్టోబరు 25: మండల పరిధిలోని పాత దువ్వూరులో వెలసిన భీమలింగేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం పుల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కేసీ ఓబుళరెడి ్డ సోమవారం రూ.లక్ష నగదును ఆలయ నిర్మాణ సహాయకులకు అందజేశారు. చరిత్ర కలిగిన భీమలింగేశ్వరాలయం జీర్ణోద్ధరణ పనులను ఇటీవల ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కోసం కేసీ ఓబుళరెడ్డి రూ.లక్ష నగదును ఆలయ నిర్మాణ సేవకులు జెర్రి నడిపి ఓబయ్య, గుర్రప్ప, అర్ధాకుల వీరయ్య, సేగినేని శ్రీనివాసులుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చీదిరి వెంకటనరసింహరాయల్‌, ఓబుళరెడ్డిని అభినందించారు. 

Updated Date - 2021-10-26T04:49:34+05:30 IST