దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఐసీయూ బెడ్ల అందజేత

ABN , First Publish Date - 2021-09-29T05:56:31+05:30 IST

దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీ య ఆసుపత్రికి దేవరకొండకు చెందిన గుడుగుంట్ల ఓంప్రకాష్‌, శ్రీనివాసులు రూ.35లక్షల వ్యయంతో 10ఐసీయూ బెడ్లను అందజేశారు.

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఐసీయూ బెడ్ల అందజేత

దేవరకొండ, సెప్టెంబరు 28:  దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీ య ఆసుపత్రికి దేవరకొండకు చెందిన గుడుగుంట్ల ఓంప్రకాష్‌, శ్రీనివాసులు రూ.35లక్షల వ్యయంతో 10ఐసీయూ బెడ్లను అందజేశారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములునాయక్‌ దాతలు ఓంప్రకాష్‌, శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములునాయక్‌ మాట్లాడుతూ దేవరకొండ పట్టణానికి చెందిన ఓంప్రకాష్‌, శ్రీనివాసులు గుడుగుంట్ల రత్నమాల పేరున రూ.35లక్షలతో 10 ఐసీయూ బెడ్లు అందజేయడం అభినందనీయమన్నారు. ఆసుపత్రిలో వైద్యసదుపాయాల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు బెలిద యాదయ్య, శ్రీనివాస్‌,  డాక్టర్‌ రవి పాల్గొన్నారు. 

వెలిమినేడు ఆసుపత్రికి ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ బహూకరణ

చిట్యాల రూరల్‌ : చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంచికంటి ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కార్యదర్శి మంచికంటి వెంకటరమణ, బోడంగపర్తి సర్పంచ్‌ మంచికంటి రాణి సౌజన్యంతో బహూకరించిన ఆక్సీజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ మిషన్‌ను  స్థానిక వైద్యాధికారి ఉబ్బు నర్సింహకు అందజేశారు. కార్యక్రమంలో సుంకెనపల్లి సర్పంచ్‌ కక్కిరేణి బొందయ్య, ఆర్యవైశ్యసంఘం మండల అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆవుల అయిలయ్య, ఆసుపత్రి హెచ్‌ఈఓ జయరామ్‌, యాకారి నరేందర్‌, పంతంగి మదనాచారి, రంగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-29T05:56:31+05:30 IST