అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి విరాళం
ABN , First Publish Date - 2022-09-28T05:05:10+05:30 IST
అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి విరాళం
మహేశ్వరం, సెప్టెంబరు 27: అమీర్పేట అయ్యప్ప స్వామి ఆలయం అభివృద్ధికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్గౌడ్ రూ.6.50లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. మంగళవారం అమీర్పేట అయ్యప్ప భక్తులు తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీనగర్లో గల దేవేందర్గౌడ్ నివాసంలో వీరేందర్గౌడ్ను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు బస్వపాపయ్యగౌడ్, ప్రధానకార్యదర్శి కె.దేవవరం, సభ్యులు నరసింహ, మచ్చేందర్, వెంకటేష్, యాదయ్య, రాఘవేందర్, శేఖర్, వంశీ, అంజయ్య, రాజు పాల్గొన్నారు.