పాఠశాల అభివృద్ధికి రూ.50వేల విరాళం
ABN , First Publish Date - 2021-02-25T04:39:07+05:30 IST
కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి క్రీసెంట్ ఫార్మసీ అధినేత షేక్.జానిమియా బుధవారం రూ.50వేల నగదును హెచ్ఎంకు విరాళంగా అందజేశారు.
కల్లూరు, ఫిబ్రవరి 24: కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి క్రీసెంట్ ఫార్మసీ అధినేత షేక్.జానిమియా బుధవారం రూ.50వేల నగదును హెచ్ఎంకు విరాళంగా అందజేశారు. ఈ పాఠశాల విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనపై ఇటీవల ఆపాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకువచ్చి ఆర్థికసాయం కోరటంతో స్పందించి తమవంతుగా ఆ నగదును హెచ్ఎం మాధవరావుకు అందజేశారు. భవిష్యత్లో తమవంతుగా చేయూతనిస్తానని జానిమియా చెప్పారు. దాతను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు ప్రతినిధి పసుమర్తి చంద్రరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.