పాఠశాల అభివృద్ధికి రూ.50వేల విరాళం

ABN , First Publish Date - 2021-02-25T04:39:07+05:30 IST

కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి క్రీసెంట్‌ ఫార్మసీ అధినేత షేక్‌.జానిమియా బుధవారం రూ.50వేల నగదును హెచ్‌ఎంకు విరాళంగా అందజేశారు.

పాఠశాల అభివృద్ధికి రూ.50వేల విరాళం
హెచ్‌ఎంకు రూ.50వేలు నగదును అందిస్తున్న క్రీసెంట్‌ ఫార్మసీ అధినేత జానిమియా

కల్లూరు, ఫిబ్రవరి 24: కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి క్రీసెంట్‌ ఫార్మసీ అధినేత షేక్‌.జానిమియా బుధవారం రూ.50వేల నగదును హెచ్‌ఎంకు విరాళంగా అందజేశారు. ఈ పాఠశాల విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనపై ఇటీవల ఆపాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకువచ్చి ఆర్థికసాయం కోరటంతో స్పందించి తమవంతుగా ఆ నగదును హెచ్‌ఎం మాధవరావుకు అందజేశారు. భవిష్యత్‌లో తమవంతుగా చేయూతనిస్తానని జానిమియా చెప్పారు. దాతను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు ప్రతినిధి పసుమర్తి చంద్రరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T04:39:07+05:30 IST