శ్రీకాకుళం జిల్లాకు వైద్య పరికరాలు ఇవ్వండి

ABN , First Publish Date - 2021-05-09T08:39:46+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసకుని ‘పీఎం కేర్స్‌‘ పథకం ద్వారా అత్యవసర వైద్య పరికారాలను సమకూర్చాలని టీడీపీ ఎంపీ కింజరాపు

శ్రీకాకుళం జిల్లాకు వైద్య పరికరాలు ఇవ్వండి

ప్రధానికి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు వినతి


న్యూఢిల్లీ, మే8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసకుని ‘పీఎం కేర్స్‌‘ పథకం ద్వారా అత్యవసర వైద్య పరికారాలను సమకూర్చాలని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను శనివారం ఇక్కడ మీడియాకు విడుదల చేశారు.  30 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్‌ యూనిట్లు శ్రీకాకుళం జిల్లాకు కేటాయించి, కరోనా బాధితులను ఆదుకోవాలని రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-09T08:39:46+05:30 IST