రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టండి

ABN , First Publish Date - 2022-08-14T06:47:29+05:30 IST

అన్నీ దానాల్లోకె ల్లా రక్తదానం ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడా లని ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణ యువకు లకు పిలుపునిచ్చారు.

రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టండి
రక్తదానం చేస్తున్న ఉద్యోగి

ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణ

గోదావరిఖని, ఆగస్టు 13: అన్నీ దానాల్లోకె ల్లా రక్తదానం ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడా లని ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణ యువకు లకు పిలుపునిచ్చారు. భారత్‌ వజ్రోత్సవాల సందర్భంగా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపా య స్థితిలో ఉన్న వారికి, తలసేమియా బాధితులకు, కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రక్తదానం చేస్తే వారి ప్రాణాలను నిలిపినవారవుతారని, బదిలీ వర్కర్లు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని యువకులను ఆయన అభినందించారు.  కార్య క్రమంలో డీవైసీఎంవో కిరణ్‌ రాజ్‌కుమార్‌, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌ రావు, అధికారుల సంఘం అధ్యక్షులు హరి ప్రసాద్‌, డీజీఎం(పర్సనల్‌) లక్ష్మీనారాయణ, రత్నమాల, వైద్యులు అంబిక, మధు, రుక్మిణి, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ బంగారు సారంగపాణి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T06:47:29+05:30 IST