వలంటీర్లు ప్రచారం చే స్తే చర్యలు
ABN , First Publish Date - 2021-03-07T07:01:47+05:30 IST
మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే వార్డు వలంటీర్లపై ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరించారు.
0866-2466877 నెంబరుకు ఫిర్యాదు చేయాలి
కలెక్టర్ పోలా భాస్కర్
ఒంగోలు (కలెక్టరేట్), మార్చి 6 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే వార్డు వలంటీర్లపై ఎన్నికల నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పోలా భాస్కర్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎక్కడైనా అభ్యర్థులకు మద్దతుగా వలంటీర్లు ప్రచారం చేస్తే ఎస్ఈసీ కాల్ సెంటర్కు 0866-2466877 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చనని తెలిపారు. జిల్లాలో అక్రమాలను అడ్డుకునే దిశగా సత్వర చర్యల కోసం ఆయా మున్సిపాలిటీల్లో ఫిర్యాదుల విభాగానికి రాతపూర్వకంగా ఫిర్యాదులు కూడా చేయవచ్చని తెలిపారు. వలంటీర్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై ఆయా మునిసిపల్ కమిషనర్లు తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు ఇవీ...
ఒంగోలు నగర పాలక సంస్థ 18004252858, మార్కాపురం 9154564422, చీరాల 9885244380, కనిగిరి 8247540183, గిద్దలూరు 08405- 243344, చీమకుర్తి 9701270129, అద్దంకి 7013343213 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.