ప్రకృతి వ్యవసాయం బాట పట్టాలి

ABN , First Publish Date - 2021-01-16T05:59:35+05:30 IST

సమాజం ప్రకృతి వ్యవసాయం బాట పట్టాలని ప్రకృతి వ్యవ సాయ నిపుణుడు విజయరామ్‌ అన్నారు.

ప్రకృతి వ్యవసాయం బాట పట్టాలి

గుడ్లవల్లేరు : సమాజం ప్రకృతి వ్యవసాయం బాట పట్టాలని ప్రకృతి వ్యవ సాయ నిపుణుడు విజయరామ్‌ అన్నారు. సింగలూరు గ్రామాన్ని శుక్రవారం విజయరామ్‌ బృదం సందర్శించింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామం భౌగోళిక, సామాజిక పరిస్థితులు ప్రకృతి వ్యవసాయానికి సానుకూలంగా ఉన్నాయన్నారు. డాక్టర్‌ బండారు శ్యామ్‌కుమార్‌ సహకారంతో ఒక ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని చేనేత మగ్గాలను, మగ్గం నేతలను వీక్షించారు. ఇస్తరాకుల పరిశ్రమలను పరిశీలించారు. శ్యామ్‌కుమార్‌, సరస్వతి దంపతులు సన్మానించారు. మల్లేశ్వరరావు, పైడేశ్వరరావు, నందం శ్రీను  పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:59:35+05:30 IST