పదో తరగతి విద్యార్థులకు చేయూత
ABN , First Publish Date - 2020-06-05T09:44:27+05:30 IST
మరో మూడు రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు పునఃప్రారంభం కానున్న తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు చేయూతనిచ్చాయు
హైదరాబాద్ సిటీ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మరో మూడు రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు పునఃప్రారంభం కానున్న తరుణంలో పలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకు చేయూతనిచ్చాయు. నగరంలో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో యునైటెడ్ వే, జన్య ఫౌండేషన్లు 80 వేల మంది విద్యార్థులు, 11 వేల మంది సిబ్బందికి రూ.26 లక్షల విలువ చేసే మాస్కులు, శానిటైజర్లు అందించాయి. నాట్కో సంస్థ 5వేల మాస్కులు, అప్పిడి టెక్నాలజీస్ 256 లీటర్ల శానిటైజర్ను పంపిణీ చేసింది. పదో తరగతి పరీక్షల సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు చూపిన ఔదార్యాన్ని కలెక్టర్ శ్వేతా మహంతి అభినందించారు.