పెంపుడు శునకానికి సీమంతం
ABN , First Publish Date - 2022-03-18T16:41:36+05:30 IST
శునకాన్ని తమ ఇంటి సభ్యుడిగా భావించిన ఓ జంట దానికి సీమంతం జరిపింది. ఆహ్వాన పత్రికలు ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానించి, రూ.50 వేలకు పైగా ఖర్చు చేసి సీమంతం
చెన్నై: శునకాన్ని తమ ఇంటి సభ్యుడిగా భావించిన ఓ జంట దానికి సీమంతం జరిపింది. ఆహ్వాన పత్రికలు ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానించి, రూ.50 వేలకు పైగా ఖర్చు చేసి సీమంతం ఘనంగా నిర్వహించింది. తమిళనాడులోని సేలం జిల్లా మెచ్చేరికి చెందిన స్టూడియో యజమాని మురుగన్- సుశీల దంపతులు ఈ వేడుకను ఇటీవల నిర్వహించారు. వీరి కుమార్తె హేమరాణి పొమేరియన్ రకానికి చెందిన హైతి అనే మగ శునకాన్ని, సారా అనే ఆడ శునకాన్ని పెంచు తోంది. ఈ నేపథ్యంలో సారా గర్భం దాల్చడంతో వీరు సీమంతం నిర్వహించడం విశేషం. సీమంతానికి వచ్చిన మహిళలకు నాలుగు రకాల స్వీట్లు, జాకెట్ గుడ్డ, గాజులు, తాంబూలం కూడా అందజేయగా, వారు సారాను ఆశీర్వదించి మరీ వెళ్లారు..!