జగిత్యాలలో శునకానికి పెద్దకర్మ

ABN , First Publish Date - 2021-09-01T23:47:03+05:30 IST

జగిత్యాలలో శునకానికి పెద్దకర్మ

జగిత్యాలలో శునకానికి పెద్దకర్మ

జగిత్యాల: ఆత్మీయంగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో దానికి 12వ రోజున పెద్దకర్మ నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు. విద్యానగర్‌కు చెందిన కాలగిరి శ్రీనివాస్ రెడ్డి- సుమ దంపతులు గత ఆరేళ్లుగా మిల్కీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. గత నెల 21న మిల్కీ మృతి చెందింది. అయితే మూడు, ఐదో రోజు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గురువారం 12వ రోజు పెద్ద కర్మను నిర్వహించి శునకం పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. తమ ఇంట్లో ఒకరిగా ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉన్న శునకం తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిందని గృహిణి కాలగిరి సుమ తెలిపారు. తమ అభిమాన ప్రీతిపాత్రమైన శునకం మృతి చెందడంతో తట్టు కోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటికి రక్షణగా ఉన్న శునకం మృతి చెందడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని వారు అభిప్రాయపడ్డారు. గురువారం శునకానికి పెద్దకర్మ నిర్వహించి పలువురికి భోజనాలు సైతం వడ్డించారు. కుటుంబ సభ్యుల మద్యే ఈర్ష్య ద్వేశాలు పెరిగి మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో శునకానికి సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించి పెద్దకర్మ జరపడం విశేషం.

Updated Date - 2021-09-01T23:47:03+05:30 IST