కుక్కలు కరుస్తున్నాయంటూ 58,869 ఫిర్యాదులు... ఎప్పుడు? ఎక్కడ?

ABN , First Publish Date - 2021-01-19T17:21:46+05:30 IST

కశ్మీర్ ఘాటీలో కుక్కల దాడులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. గడచిన...

కుక్కలు కరుస్తున్నాయంటూ 58,869 ఫిర్యాదులు... ఎప్పుడు? ఎక్కడ?

శ్రీనగర్: కశ్మీర్ ఘాటీలో కుక్కల దాడులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. గడచిన పదేళ్లలో కుక్కలు కరుస్తున్నాయంటూ వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 58,869 ఫిర్యాదులు అందాయి. ఈ లెక్కన చూస్తే ప్రతీరోజు ఇటువంటి 16 ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ అందజేసిన వివరాల ప్రకారం 2011 జనవరి నుంచి 2021లో ఇప్పటివరకూ మొత్తం 58,868 మంది కుక్క కాటుకు గురయ్యాయి. కుక్క కాట్లకు సంబంధించి శ్రీనగర్‌లో అత్యధిక ఫిర్యాదులు అందాయి. రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతుండటంతో ప్రజలు వీధికుక్కలను చూడగానే వణికిపోతున్నారు. ఎస్ఎంహెచ్‌ఎస్ చికిత్సా విభాగం అధికారి డాక్టర్ సలీమ్ ఖాన్ మాట్లాడుతూ ప్రతీయేటా ఐదు నుంచి ఆరు వేలమంది కుక్క కాటు బాధితులు ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. 

Updated Date - 2021-01-19T17:21:46+05:30 IST