దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-17T05:06:56+05:30 IST

సుండుపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించుకున్నట్లు దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు తెలిపారు.

దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు లాక్‌డౌన్‌

సుండుపల్లె, మే16: సుండుపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించుకున్నట్లు దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దస్తావేజు లేఖర్లు లాక్‌డౌన్‌ ప్రకటించారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో తిరిగి పొడిగిస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా రిజిస్ర్టేషన్లు ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  

Updated Date - 2021-05-17T05:06:56+05:30 IST