ప్రభుత్వ వైద్యుల బదిలీలకు కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-08-10T06:25:11+05:30 IST

రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల బదిలీలకు మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

ప్రభుత్వ వైద్యుల బదిలీలకు కౌన్సెలింగ్‌

అనపర్తి సీహెచ్‌సీని ఎంచుకున్న ఎక్కువ మంది వైద్యులు  



రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 9 : రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల బదిలీలకు మంగళవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు.ఉన్నతాధికారులు విజయవాడ నుంచి జూమ్‌లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం నుంచి వైద్యులు పాల్గొన్నారు. ఎంపిక చేసుకున్న ఆప్షన్ల మేరకు ఖాళీలను అనుసరించి ఆయా ఆసుపత్రులకు బదిలీలు చేశారు. ఎక్కువ మంది వైద్యులు అనపర్తి సీహెచ్‌సీని ఎంచుకున్నారు. అనస్థీషియా విభాగం అధిపతి జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి బదిలీ కోరుకున్నట్టు సమాచారం.వీరందరికీ త్వరలోనే బదిలీ ఉత్తర్వులు రానున్నాయి. వీరిస్థానంలో డీఎంఈ నుంచి వైద్యులు ఇక్కడకు రావాల్సి ఉంది. 


Updated Date - 2022-08-10T06:25:11+05:30 IST