శ్రీసిటీ ఎండీకి డాక్టరేట్ ప్రదానం
ABN , First Publish Date - 2022-05-25T06:02:03+05:30 IST
శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
సత్యవేడు, మే 24: శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. నెల్లూరులో మంగళవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ను అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ కోసం తాను సలిపిన కృషిని గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ డీఎన్ రెడ్డి, విక్రమ సింహపురి వర్సిటీ వీసీ జీఎం సుందరవల్లి తదితరులు పాల్గొన్నారు.