లాలూకు వైద్యం అందించిన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ కన్నుమూత!

ABN , First Publish Date - 2021-08-14T17:57:02+05:30 IST

జార్ఖండ్‌లోని రిమ్స్ మెడిసిన్ విభాగం...

లాలూకు వైద్యం అందించిన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ కన్నుమూత!

రాంచీ: జార్ఖండ్‌లోని రిమ్స్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీ ఉమేష్ ప్రసాద్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. డాక్టర్ ఉమేష్... మల్టిపుల్ మైలోమా వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఒక తరహా బ్లడ్ క్యాన్సర్ లాంటిదని వైద్యులు చెబుతారు. ఈ వ్యాధి కారణంగా డాక్టర్ ఉమేష్ వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఇదే పరిస్థితిలో డాక్టర్ ఉమేష్ ఆసుపత్రికి వస్తూ, విధులు నిర్వహిస్తూవచ్చారు. ఆర్జేడీ చీఫ్ లాలూకు దీర్ఘకాలంగా డాక్టర్ ఉమేష్ వైద్య సేవలు అందించారు. డాక్టర్ ఉమేష్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-14T17:57:02+05:30 IST