విశాఖలో డాక్టర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-05T02:25:52+05:30 IST
విశాఖలో డాక్టర్ ఆత్మహత్య
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఏలేరు కాలువలో దూకి డాక్టర్ శ్యామల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన డాక్టర్ శ్యామల (34) ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రస్తుతం కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్సీలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.