డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం తీసుకుంటున్న సీబీఐ
ABN , First Publish Date - 2020-05-30T17:41:49+05:30 IST
విశాఖ: హైకోర్టు ఆదేశం మేరకు నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ అధికారులు తీసుకున్న విషయం తెలిసిందే.
విశాఖ: హైకోర్టు ఆదేశం మేరకు నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ అధికారులు తీసుకున్న విషయం తెలిసిందే. నేడు డాక్టర్ సుధాకర్ చికిత్స పొందుతోన్న ప్రభుత్వ మానసిక వైద్యశాలకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం సీబీఐ బృందం సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకునే పనిలో ఉంది.
కాగా.. సీబీఐ అధికారులు శుక్రవారం పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. డాక్టర్ సుధాకర్ అభియోగాల మేరకు విశాఖపట్నంలో గుర్తుతెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖపట్నం సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేశారు.