ఒక్క రోజులో రూ. 224 పెరిగిన ‘డాక్టర్ లాల్ ప్యాథ్ల్యాబ్స్’ షేర్
ABN , First Publish Date - 2021-08-03T22:09:30+05:30 IST
డాక్టర్ లాల్ ప్యాథ్ల్యాబ్స్ షేరు ఈ రోజు(మంగళవారం) పరుగులు పెట్టింది. ఒక్క రోజులోనే రూ. 224 పెరిగి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.
ముంబై : డాక్టర్ లాల్ ప్యాథ్ల్యాబ్స్ షేరు ఈ రోజు(మంగళవారం) పరుగులు పెట్టింది. ఒక్క రోజులోనే రూ. 224 పెరిగి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇంట్రాడేలో దాదాపు ఆరు శాతానికి పైగా పెరిగిన డాక్టర్ లాల్ ప్యాథ్ల్యాబ్స్ షేర్... రూ. 3943.75 కి ఎగసి, ఆ తర్వాత రూ. 3,900-రూ. 3,925 మధ్య కదలాడుతోంది. రూ. 32 వేలకోట్లకు పైగా మార్కెట్ కేపిటలైజేషన్ కలిగి మిడ్ క్యాప్ సెగ్మెంట్లోకి వచ్చే ఈ డయాగ్నొస్టిక్ సర్వీసెస్ కంపెనీ... ఇటీవలే వాటాదారులకు షేరుకు రూ. 6 చొప్పున డివిడెండ్ను ప్రకటించింది. దీనికి రికార్డ్ డేట్ ఆగస్ట్ 22కాగా, పద్ధెనిమిది మంది విశ్లేషకులు ఈ స్టాక్ను ట్రాక్ చేసినట్లు ఎకనమిక్ టైమ్స్ డేటా చెబుతుండగా, వారిలో... అమ్మేయమని... పదకొండు మంది, కొనుగోలు చేయవచ్చని ముగ్గురు, హోల్డ్ చేయాలంటూ నలుగురు సూచించారని ఈటీ చెబుతోంది.