కరోనా ఎఫెక్ట్...వాట్సాప్‌లో డాక్టరును సంప్రదించవచ్చు...

ABN , First Publish Date - 2020-03-26T15:54:12+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతో 21రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోగులెవరైనా వైద్యులను ఫోన్ కాల్ లేదా టెక్స్ట్ లేదా వాట్సాప్ సందేశాల ద్వారా....

కరోనా ఎఫెక్ట్...వాట్సాప్‌లో డాక్టరును సంప్రదించవచ్చు...

  • కేంద్రం టెలీమెడిసిన్ మార్గదర్శకాల జారీ 

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతో 21రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోగులెవరైనా వైద్యులను ఫోన్ కాల్ లేదా టెక్స్ట్ లేదా వాట్సాప్ సందేశాల ద్వారా సంప్రదించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా రోగుల కోసం కేంద్ర ప్రభుత్వం టెలీమెడిసిన్ కొత్త మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. టెలీమెడిసిన్ చికిత్సకు ముందు రోగులు, రిజిస్టర్డు మెడికల్ ప్రాక్టీషనర్లు ఇద్దరూ ఒకరి గుర్తింపు మరొకరు తెలుసుకోవాలి. రిజిస్టర్డు మెడికల్ ప్రాక్టీషనర్ల పేరు, వారి వయసు, చిరునామా, వారి ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, రిజిస్టరు ఐడీ ధ్రువీకరించాలని కేంద్రం కోరింది. డాక్టరు రోగికి ప్రిస్ర్కిప్షన్ జారీకి ముందు వారి వయసు అడిగి తెలుసుకోవాలి. రోగి మైనర్ అయితే వైద్యులు పెద్దవారితో సంప్రదింపులు జరిపేందుకు టెలీకన్సల్ టేషన్ అనుమతిస్తారు. 

Updated Date - 2020-03-26T15:54:12+05:30 IST