భార్య ఉండగా నర్సుతో ప్రేమ వ్యవహారం నడిపిన డాక్టర్.. భార్యను విడాకులివ్వడానికి ఎంతకు తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-03-04T05:43:45+05:30 IST

అతనొక డాక్టర్. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలుండగా క్లినిక్‌లో తనతో పనిచేసే నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య అతనితో గొడవపడేది. దీంతో ఆ డాక్టర్ భార్యను విడాకులివ్వడానికి ఘోరంగా...

భార్య ఉండగా నర్సుతో ప్రేమ వ్యవహారం నడిపిన డాక్టర్.. భార్యను విడాకులివ్వడానికి ఎంతకు తెగించాడంటే..

అతనొక డాక్టర్. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలుండగా క్లినిక్‌లో తనతో పనిచేసే నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్య అతనితో గొడవపడేది. దీంతో ఆ డాక్టర్ భార్యను విడాకులివ్వడానికి ఘోరంగా అవమానించాడు. ఆమె చూస్తూ ఉండగానే తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి శృంగారం చేశాడు. ఇంతటితో ఆగక భార్యను వదిలించుకోవడానికి ఎంత పని చేశాడంటే..


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ పట్టణంలో నివసించే హరేంద్ర సింగ్ అనే ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌తో నిషా తల్వార్(పేరు మార్చబడినది) అనే యువతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని నెలల క్రితం డాక్టర్ హరేంద్ర క్లినిక్‌లో మీనా అనే ఒక యువతి నర్సుగా పనిచేస్తోంది. మీనా అందాన్ని చూసి నరేంద్ర ఆమెతో ప్రేమలోపడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం నిషాకు తెలియడంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 


ఈ క్రమంలో డాక్టర్ హరేంద్ర తన భార్యకు విడాకులివ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఆమెపై ఒత్తిడి చేసేందుకు ఒక పథకం ప్రకారం తన ప్రియురాలు మీనా ఇంటికే తీసుకువచ్చాడు. దీంతో హరేంద్రను నిషా ఎదిరించింది. కానీ మీనా, హరేంద్ర కలిసి నిషాను చితకబాదారు. ఆ తరువాత భార్య చూస్తూ డాక్టర్ హరేంద్ర తన ప్రియురాలితో శృంగారం చేశాడు. 


కళ్ల ముందే తన భర్త అమనుషానికి పాల్పడడంతో.. నిషా ఇల్లు వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత తల్లిదండ్రుల సహాయంతో పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గృహహింస చట్టం కింద డాక్టర్ హరేంద్రపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Updated Date - 2022-03-04T05:43:45+05:30 IST