మేయర్‌కి గౌరవం ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-08-04T05:12:29+05:30 IST

నగర మేయర్‌కు కనీస గౌరవం ఇవ్వరా? అని విజయనగరం అర్బన్‌ తెలుగు మహిళ నాయకులు ప్రశ్నించారు.

మేయర్‌కి గౌరవం ఇవ్వరా?
మాట్లాడుతున్న తెలుగు మహిళ నేతలు

విజయనగరం రూరల్‌:  నగర మేయర్‌కు కనీస గౌరవం ఇవ్వరా? అని  విజయనగరం అర్బన్‌ తెలుగు మహిళ నాయకులు ప్రశ్నించారు. బీసీ మహిళకు నగరపాలక సంస్థ సాక్షిగా అవమానం జరుగుతుందన్నారు.  మంగళవారం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళ నాయకులు అనురాధ బేగం, కర్రోతు రాధామణి, పత్తిగిల్లి సూర్యకుమారి మాట్లా డుతూ.. నగర ప్రథమ మహిళ మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మిని అడుగడుగునా అవమానిస్తున్నారని ఆరోపించారు.  డిప్యూటీ మేయర్‌గా కోలగట్ల శ్రావణి ఎన్నికైన సందర్భంగా  కార్పొరేషన్‌ అధికారులు వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో   మేయర్‌ని కాదని, డిప్యూటీ మేయర్‌ మెప్పు కోసం చేసే ప్రయత్నాలు బీసీ మహి ళలు తలదించుకునే విధంగా ఉన్నాయన్నారు.  బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నా మంటున్న వైసీపీ నాయకులు ఓ సారి ఆలోచించాలని సూచించారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు.  సమావేశంలో తెలుగు మహిళా నాయకురాలు కంది శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-04T05:12:29+05:30 IST